Sunday, April 3, 2016

గీతా మకరందం


అ)ఆత్మ కు చావు లేదు అని అంటాము కానీ తీరా మనదాకా వచ్చే సరికి మరిచిపోతాము. అయితే భగవానువాచ ఆత్మను చనిపోయేది మరియు చంపునది అని తలచేవాడు అజ్ఞాని అని...
1)య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్,     (2,19)
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే
సం.వ్యాఖ్యః----యో మనుష్యః చిన్తయతి అస్య ఆత్మన్ యథా మృత్యుః ఉపగమ్యతి అథవా మృత్యుం దదాతి సః అజ్ఞానీ ఏవ, యతః అస్య ఆత్మన్ న మరతి వా మారిష్యతి.
ఆత్మను చనిపోయేదానిగానూ, చంపుదానుగానూ తెలిసిన వాడు (అనుకొనువాడు) అజ్ఞాని, ఏలననగా ఆత్మ ఎవ్వరినీ చంపదు మరియు ఎవరిచేతనూ చంపబడదు.
ఆ)ఎన్నో కోరుకుంటాము తీరకపోతే చింతపడతాము. మనసును నియంత్రించుకునేవానికి అన్నీ సమకూరుతాయి అని భగవానులు చెబుతున్నారు. 
2)అపూర్యమాణమచల ప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్    (2,70)
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ
సం.వ్యాఖ్యః--- నద్యాః వినా  ప్రకంపితం తం అచల ప్రతిష్ఠితం సముద్రం ప్రవిశంతి, తావదేవ కామాః ప్రయోజనాః స్వయమేవ ప్రవిశంతి తం, యో అచల ప్రతిష్ఠితః, సః శాంతిమాప్నోతి నతు కామీ పురుషః.
నదులు సముద్రుని స్థాన భ్రంశము కానీయకయే స్వాభావికముగా ప్రవేశించి నట్లు స్థిర చిత్తుని స్వయముగానే అన్ని భోగములూ వరించును అతడు శాంతిని పొందును అంతేకానీ కామనల పై పరితపించు కామిని కాదు. భోగి శాంతిని పొందజాలడు.

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...