Thursday, December 26, 2019

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం లో భాగవతం

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం లో భాగవతం
మేము ఓక ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులం, మాలో అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం కలిసి షుమారు 20,000 పై చిలుకు ఉన్నాం అందులోనూ కన్యలు మాతల సంఖ్య 80%. మేము దేశ విదేశాల లోని వివిధ ప్రాంతాలనుంచి మూల మూలల నుంచి వచ్చాం. మా మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ ఒకే విశ్వ పిత సంబంధం కారణం గా మా మధ్య తెగని బంధం ఏర్పడింది. మాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ఖ్ అని లేరు, మా అందరికీ ఒకే బాబా ఆయనే తల్లి తండ్రి ఒకే శరీరం లో అర్ధనారీశ్వరుడుగా. వినడానికీ విశ్వసించడానికి విచిత్రం అయినా నిజం నిరూపించు కోవడానికి అవసరం ఏమిటి. మీరే స్వయంగా వచ్చి ప్రేమతో తెలుసుకుంటే తెలుస్తుంది. మేము అవిచ్ఛిన్న మైన ఆశక్తి కి ఏకతా అనే తాటితో కట్టుబడి ఉన్నాం. పరమపిత పరమాత్మ శివుడు కంపిల్ గ్రామంలో (యూ.పీ.)జగత్పిత జగదంబ రూపంలో ప్రవేశించడంతోనే ఈ అసంభవ కార్యం సంభవమైనది. నిజానికి ఇది ఒక అద్భుతం ఇప్పటి భారతదేశపు పటంలో ఏమాత్రం విలువలేని ఓ కుగ్రామంలో ఎలా దేశపు మూల మూలల నుంచి ఈ దార్శనిక సిద్ధాంతానికి కట్టుబడి ఈ చిన్న గ్రామంలో ఒకటి అయ్యి నిలుచున్నాము. ఈ కుగ్రామంలో ప్రజలకు కనీసం పొట్టనింపుకోవడానికి రెండుపూటల రెండు రొట్టెలకు కూడా గతిలేదు. మేము మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి మీతో ఈ రహస్యాలు పంచుకుందాం అనుకుంటున్నాము.
నిజానికి మేము బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మౌంట్ అబూ రాజస్థాన్ ఇంకా ఆ సంస్థ అనేక విభాగాల లో చెప్పబడే జ్ఞానం తో ప్రభావితులమై వారితో కలిసి ఉండేవారం. కానీ ఆశ్చర్యం ఏమంటే పరమపిత శివపరమాత్మ దాదా లేఖరాజ్. బ్రహ్మ మాధ్యమంగా మౌంట్.అబూ లో 1951 నుంచీ 1969 వరకూ చెప్పిన మహావాక్యాలు వీటినే జ్ఞాన మురళీలు అంటారు మరియు 1969 నుంచీ ఇప్పటివరకూ బ్రహ్మకుమారీ గుల్జార్. మోహిని గారి ద్వారా చెప్పిన చెప్పబడుతున్న అవ్యక్తవాణి ల గహన అధ్యయనం లేక మనన చింతనం ఆధారంగా ఎన్నో రహస్యాలు జిగ్జ్ఞాసులనుంచి దాచి ఉంచుతున్నారు. ఆ రహస్యాల ప్రమాణం మూల ఈశ్వరీయ మహావాక్యాల నుంచి తొలగించారు అని తెలుస్తున్నది. జ్ఞాన మురళీలు మరియు అవ్యక్తవాణీల లో ఎక్కడైనా రాముని, శంకరుని, ప్రజాపిత యొక్క విషయం వస్తే ఆ మహావాక్యాలు బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయం, మౌంట్.అబూ ద్వారా ప్రింటు చేయబడినవి నేడు పునః ముద్రితమౌతున్న(రివైజ్)మురళీలలో ఏ కోశానా వెతికినా కనిపించడం లేదు. తొలగించ బడిన ఈ వాక్యాలు శ్రీమత్.భగవద్గీతశ్లోకాల లో రచయిత మరియు రచన రహస్యాలు నేటికీ రహస్యాలై అగుపిస్తాయి. ఇవ్వే మమ్మల్ని ఐతిహాసిక గ్రామం కంపిల్. వైపు ఆకర్షించాయి.
మౌంట్ అబూలో దాదాలేఖరాజ్. బ్రహ్మద్వారా చెప్పిన మహావాక్యాల రహస్య సారం కంపిల్.లో ఉన్న ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉనికి వెలికి తీసింది. మొత్తం లోకంలో ఫరూఖాబాద్. మహాత్మ్యాన్ని చాటిచెప్పింది. ఈ రహస్యాలే మమ్మల్ని జగత్పిత జగదంబ లను క్రమశః మా మాతాపిత ప్రజాపిత, బ్రహ్మ అని తెలుసుకునేలా చేశాయి మరియు మమ్మల్ని ఈశ్వరీయ సేవకు అంకితమయ్యేలా సమర్పితమయ్యేలా చేశాయి. ఈ విధంగా మేము దేశం నలుమూలల నుంచి వచ్చినా అపరిచితులమైనా విభిన్నప్రాంతాల, భాషలవారమైనా ఒకే మనసు, ఒకే వచనం, ఒకే కర్మ కలవారమై అది ఒకే తండ్రి మాటపై ఆధారపడి మాతాపితల ఛత్రఛాయ లో ఒక దివ్య ఈశ్వరీయ కుటుంబం అనే సుత్రం లో కట్టుబడి ఉన్నాం. ఇది కేవలం ఒక విశ్వవిద్యాలయమేకాదు, ఒక ఇల్లుకూడ. ఈ కుటుంబం కేవలం భారత్ లోనే కాదు. విశ్వమంతా వ్యాపించింది. మా లక్ష్యం జాతి, మత, భేదభావాలకు అతీతంగా వసుధైవ కుటుంబం స్థాపన చేయడంలో పరమాత్ముడి సాకార మాధ్యమానికి (బాబాకి) భుజాలమై ఉండడం అంటే సహాయకారులం సదా అవడం. ఇది ఒక సత్సంగం, ఈ కుటుంబం కేవలం ఒకే సత్యమైనవాడు, శివకరుడు, ఒకే శివబాబా సాంగత్యంలో ఒకేబాబా సాంగత్యంలో రంగరించ బడి ఉన్నాం. ఈ కుటుంబం విశ్వంలో విడదీయరాని అతిపెద్ద కుటుంబం వసుధైవకుటుంబంగా ఉద్భూతం కాబోతున్నది. ఈ మా కుటుంబం మాత్రమే ఈశ్వరుని ఙ్ఞానం ద్వారా ఈ కలియుగీ రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చే శక్తి కలవారం. ఆఁ ఐతే స్వర్గీయ స్థితి రావడానికి తప్పక ప్రతీవ్యక్తి మహాభారీ మహాభారత యుద్ధంలో పాల్గోవాల్సిందే. పాండవుల జీవనమే తెలుపుతుంది –అన్ని రోజులూ మనవి కావని.-  

  

Tuesday, December 24, 2019

నాలుగు పేపర్లు

అక్కడ ఆత్మల లోకం ఈ జ్ఞానం లో నలుగు సబ్జక్ట్లు . జ్ఞానము, యోగం, ధారణ మరియు సేవ. జ్ఞానం అంటే తెలియడం. ఏమి తెలియడం నేను ఆత్మ నా తండ్రి పరమ పిత పరమాత్మ శివబాబా ఎవరు అని తెలియడం.  అయన ఏ సాధారణ మానవునిలో ప్రవేశించి ఉన్నారో తెలిసిన తరవాత అయనను స్మృతి చేయడం యోగం, అయన తెలిపే ధర్మం పాటించడం ధారణ మరి సేవ అంటే ఈ జ్ఞానం అర్ధం చేసుకుని ఇతరులకు అర్ధం చేయించడం సేవ. స్మ్రుతి చేసే వారే స్వర్గం లోకి వెళతారు. పదవి కూడా పొందుతారు. స్మ్రుతి చేయడానికి కూడా జ్ఞానం కావాలి ఒక్కరినే తలుచుకోవాలి గీత లో కూడా మామేకం అని మాట వచ్చింది. పురుషార్ధం చేయవలసినవి  జ్ఞాన యోగ ధారణా సేవ అనే నలుగు పేపర్లు . పతితులు పావనం అవ్వాలి అనేక దేహ దారుల సాంగత్యం లో పతితులు ఆయారు ఇప్పుడు ఒక్కరి సాంగత్యం లో పావనం అవ్వాలి.
ప్రయత్నాలు ఎన్నో చేసారు కాని ఎవరూ దేవత కాలేదు. ఆత్మల కనెక్షన్ కేవలం పరమాత్మ తోటే. మనని మనం ఆత్మ అనుకుని పరమాత్మను తలుచు కోవాలి. చైతన్యం ఆత్మ కదా జడ శరీరం ఏమి చేయదు. చైతన్యం అంటే మాట్లాడేది నడిచేది. గుహ్య మైనది జ్ఞానం .స్వర్గం లో కూడా దేహాభిమానం ఉంటుంది. దేహం పేరు పడుతుంది కదా. లక్ష్మి నారాయణుడు, రాధ కృష్ణులు అలా.  కనుక ఈ కష్టం చేయమంటారు. ఏమిటి ఆ కష్టం మనని ఆత్మ అని ప్రాక్టికల్ గ అనుకోవడం  సుఖ ధామం వెళ్ళడానికి ఆత్మ అభిమాని కావాలి కష్టం చేయ కుండ ఏది రాదు. కష్టమే లేక పొతే అన్దరూ విశ్వ మాలిక్ అయిపోవచ్చు. కాని ఒక్కరే విశ్వ నాధుడు అయ్యారు. అయన పరివారం కూడా భూమిపై నక్షత్రాలు భోమ్మీద విశేష ప్రజ్ఞ కల మహిమాన్వితులు పూజించబడే దేవతలు.  జ్ఞానం అర్ధం చేసుకున్న వారికి సులువు. కేవలం విని వదలడం కాదు పాటించాలి. మననం చేయాలి. మాయ అపోజిషన్ చాలా ఉంది. కొంత మంది తలరాత చాల బాగుంది వారు జ్ఞానం యోగ పురుషార్ధం లో లీనం అయ్యారు. లేని వారు దేహ సంపాదనలో మునిగి పోయారు. 
వారు భక్తులు కేవల దర్శనం కోరు కుంటారు. భక్తి లో కష్టం ఉంటె జ్ఞానం లో కూడా ఉంది. తరవాత వచ్చే వారు పురుషార్ధం చేయరు అని కాదు. చివరలో వచ్చినా పురుషార్ధం చేసి ముందుకు వెళ్లి ఫస్ట్ రావచ్చు. మేము పొట్ట సంపాదన వదిలి ఈశ్వరీయ సంపాదనలో ఉంటాము. ఇక్క డ ఆత్మ ఐ కురుచుటాము. ఇది ఆత్మ తపస్సు దేహ తపస్సు కాదు ఉల్టా నిల్చో, ఆసనం వెయ్యి ఇవ్వి కాదు... ఆత్మ తపస్సు ఇక్కడ అక్కడ దైహిక తపస్సు. 
మీరు పవిత్ర్ ఋషులు. ఋషులు అని తపస్వులను అంటారు. ఘోర తపస్సు చేసాడు విశ్వామిత్రుడు అంటారు పెద్ద రాజు కదా. ఇక్కడ ఎక్కడకో వెళ్ళ వలసిన పని లేదు. ఒక్క సెకెండ్ లో దేహం దేహ సంబంధాలు మరిచి ఆత్మ అనుకో....బీతి కో బీతి దేఖో ఏ దునియా న జీతీ దేఖో....... జరిగి పోయింది జరిగి పోయింది. ఈ లోకం చచ్చి పోయింది. అంటే మనకు ఈ లోకం తో పని లేదు..... మన పని ఎవరు ఎలాంటి వారైనా వారికి సహాయం చేయడమే, డబ్బులు ఇవ్వలేక పోవచ్చు  కాని  శాంతి ప్రేమ ఆనందం సుఖం ఇవ్వగలం.   

పంచుకోవాలని ఉంది

ఈ రోజు కొంచం నాక్కూడా ఏదో మీ తో పంచుకోవాలని ఉంది. అందరి సహృదయుల మధ్య మరిచి పోయిన సాహిత్య పిపాస పెంచుకోవాలని ఉంది. చదువరులు లేక ఒంటరి నైన నన్ను మీతో కలుపుకుని ఊహల పల్లకి ఎక్కించిన మిమ్మల్ని కొలుచుకోవాలని ఉంది. (సాంగత్య మహిమ సుమీ)
మహామహుల మధ్య ఏదో ఓ మూల కుర్చుని మీ భావాల మిఠాయి పాకం భోషాణం లో నన్ను నేను మున్చుకోవాలని ఉంది హై బాబోయి హింత క(పి)విత్వం నాకే తన్నుకు వచ్చేస్తోందేమి టని మనసు అద్దం లో నా మొహం చూసుకోవాలని ఉంది.
విషయానికి వస్తే....ఈ రోజు మా గురుగారు చెప్పేరు హిందీ లో "బీతి కో బీతీ సమఝో ఏ దునియా నా జీతీ సమఝో"बीती को बीती समझो, इस दुनिया को न जीती समझो".... అంటే జరిగి పోయింది జరిగి పోయిందనుకో , ఈ లోకం అసలు బతికే లేదనుకో" అని తెలుగులో చెప్పుకోవచ్చు....... ఎందుకో ఈ మాటలు బాగా లోతుగా అనిపించాయి. ఎవరో అన్న మాటలు పట్టుకుని దీర్ఘాలు తీస్తాం కాని జరిగి పోయింది చింతించడం మానేస్తే, అసలు ఈ లోకమే లేదు నేను నా దేవుడు తప్ప అనుకుంటే అంత హాయి లేదేమో.....

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...