Tuesday, September 22, 2015

ప్రతి మనిషికి నలుగురు తండ్రులు ?

https://youtu.be/AAbWfJsHcdA

పై లింకు క్లిక్ చేయండి

ప్రతి మనిషికి నలుగురు తండ్రులు ? ఎలా ?
1,2)ఎలాగంటే లౌకిక అలౌకిక పారలౌకిక తండ్రులని వారికి పెరు. లౌకిక తండ్రి మనకు ఈ శరీరానికి జన్మ నిచ్చిన వాడు,  లేదా దత్తత తీసుకున్న వారు అప్పుడు ఇద్దరు అయ్యారు,
3)పారలౌకిక తండ్రి పరలోకం లో ఉండే వారు... గీతలో ఒక శ్లోకం ఉంది
"న తత్ భాసయతే సూర్యో న పావకః, యద గత్వా న నివర్తన్తే తత్ ధామ పరమం మమ"
అనగా సూర్య చంద్రులు, నక్షత్రాలు అగ్ని వీటన్నిటికీ పరమైనది అనగా వాటి కాంతి కి అందనిది పైన పరంధామం నా లోకం అని అయన స్వయం గా తన నివాస స్థానం వర్ణిం చారు అక్కడే మనం కూడా నిరాకార సుక్ష్మ బిందువు రూపంలో ఉంటాము అదే ముక్తి ధామం ఆత్మల లోకం బంగారు ఎరుపు కలగలిసిన్ కాంతి లోకం శాంతి ధామం అక్కడ నుండి ఈ లోకం లోకి భూమి పైకి వచ్చి మనం ఆత్మలం శరీరం తీసుకుని మన మన పాత్రలు చేస్తాం జనన మరణ చక్రం లో తిరుగుతూ ఉంటాం పరమ పిత జనన మరణాలకు అతీతుడు ఆత్మలకు తండ్రి మనలాగే సుక్ష్మ జ్యోతి బిందు రూపుడు వెలిగే చుక్క
4)ఇక అలౌకిక తండ్రి అతి ముఖ్య మైన వాడు ఈయన కూడా మనలాగే మనిషి ఆత్మ మనుష్యాత్మలకు తండ్రి అలౌకికం అని ఎందుకు అన్నాము అంటే ఈ లోకం వాడైనా పరలోకంలో ఉండే శివ పరమాత్మ పారలౌకిక తండ్రి పై నిత్యం యోగ సాధన లో ఉంటారు పరమాత్మ ఈయనలో ప్రవేశించి మొదట ఈయనను తన సమానం గా నిరాకారి, నిర్వికారి నిరహంకారి వలె తయారు చేసి ఈయన ద్వారా మిగతా మనందరినీ కూడా నిరాకారి నిర్వికారీ నిరహన్కారిగా చేస్తారు, అలాగ చేసి పరమదామానికి తీసుకు వెళతారు మనంతట మనం వెళ్ళలేము పతిత ఆత్మలం పావన ధామం ముక్తి ధామానికి వెళ్ళలేము కనుకనే పావనం చేయడానికి శివ పరమాత్మకు ఈ అలౌకిక తండ్రి శరీరం ఆధారం తీసుకోవలసి వస్తున్ది. ఎందుకంటె శరీర సాంగత్యం తోనే పతితులంయ్యాము అనేకుల సాంగత్యం తో కనుక ఒకరి సాంగత్యం ద్వారా పావనం గా అవ్వాల్సి ఉన్ది. పతితులను పావనం గా చేసేది పారలౌకిక తండ్రి మాత్రమె.
5000 సంవత్సరాల కొక సారి మనం ముక్తి దామానిని వెళతాము అలా మనను పరంధామం తీసుకు వెళ్ళడానికి స్వయం పరమ పిత పరమాత్మ ఈ అలౌకిక తండ్రిలో ప్రవేశించి ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడే ఎందుకంటె ఇప్పుడే 5000 సంవత్సరాల అవధి పూర్తీ అయ్యింది కనుక.

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...