Wednesday, August 24, 2016

దేవతలు హింసచేయరు, మరి ఈ అసురులను చంపడం ఏమిటి ?

దేవతలు హింసచేయరు, మరి ఈ అసురులను చంపడం ఏమిటి ?
Image result for mahakali photo
ప్రతీ విషయమూ సూక్ష్మము స్థూలమూ అని రెండు అర్ధాలు ఉంటాయి. కనిపించే అర్ధం, ఇంకా గూడార్ధం అని.
దుర్గ, కాళీ జగదంబ అని మాతకు పేర్లు. కాళి రాక్షసుల కంఠాలు తెగగోసింది అంటారు అలా చంపడం వల్ల వాడిలో రాక్షసత్వం పోదు. మళ్ళీ జన్మలో మళ్ళీ రాక్షసుడౌతాడు. ప్రతీవాళ్ళూ పుట్టగానే దుష్టులుగా ఉండరు. అందరూ హీరోలే అవుదామనుకుంటారు, విలన్ అవుదామని ఎవరూ అనుకోరు. దేహ అభిమానం అని అసురత్వానికి గుర్తు. దేవతలు ఆత్మాభిమానులు. దేహాభిమానం కనుకనే రాక్షసులను పేద్ద పేద్ద దేహాలతో చుబించారు ఇది లాక్షణికం.
వారిలోని ఆ దేహాభిమానాన్ని కాళి ఖండిస్తుంది. ఆ గర్వం పోయిననాడు వాడు దేవుడు అవుతాడు. అప్పుడు ఆమె
వారి శిరస్సులను మెడలో వేసుకుంటుంది అంటే వాళ్ళ మహిమను పొగుడుతుంది. నా పిల్లలు అంటుంది. వాళ్ళు అమె భక్తులు ఐపోతారు. ఎందుకంటే ఆమె వారికి మనశ్శాంతినిచ్చింది. ఎప్పుడైతే మనలో అహంకారం పోయిందో అప్పుడు మనం శాంతస్వరూపులం ఐపోతాము. అలా మనకు ఉపకారం చేసిన ఆమెను మనం మహిమ చేస్తాము.
ఇదే క్రిష్ణుడు చక్రంతో శిశుపాలుడి శిరసుఖండించాడు అతని ఆత్మ ఆయనలో కలిసి పోయింది అంటారు . వాస్తవానికి ఆ ఆత్మ ఆయనలో కలవడం కాదు ఆయనకు భిన్నంగా ఆ ఆత్మ ఇంక నడచుకోదు. ఆయన మార్గంలోనే ఆ ఆత్మ తుచా తప్పకుండా నడుస్తుందని భావం. ఇది నాటకీయంగా అలా చూబించారు.
కనుక దేవతలు హింసచేయరు. ఇది అహింసా యుద్ధం. దీని వల్ల లోకంలో స్వర్గం వస్తుంది.



No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...